8, మార్చి 2014, శనివారం

శివున్ని ఏ పూలతో పూజిస్తే ఏ ప్రాప్తి లభ్యమవుతుంది?


శివున్ని ఏ పూలతో పూజిస్తే ఏ ప్రాప్తి లభ్యమవుతుంది? 
ఉమ్మెత పూలతో పూజిస్తే పుత్రప్రాప్తి , 
జాజి పూలతో పూజిస్తే వాహన ప్రాప్తి,
తుమ్మి పూలతో పూజిస్తే మోక్ష ప్రాప్తి,
నందివర్థనం తో పూజిస్తే సౌందర్య ప్రాప్తి,
నువ్వుపూలతో పూజిస్తే యవ్వన ప్రాప్తి,
గన్నేరు పూలతోపూజిస్తే శత్రునాశనం,
శిరీష పుష్పాలతో సంతోషం మీ సొంతమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
పూజిస్తే సంతోషం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయ.


శివలింగానికి అభిషేకం ఎందుకు ? 

శివ లింగానికి అభిషేకం ఎందుకు చేయాలి ? శాస్త్రాలు చెబుతున్నది ఏమంటే...లోక సంరక్షణార్థం హాలాహలాన్ని(విషం) మింగిన ఆ స్వామికి కృతజ్ఞతాపూర్వకంగా చేసే ప్రక్రియ అభిషేకం. పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరినీరు అనే పంచామృతాలతో స్వామిని అభిషేకిస్తే స్వామి చల్లబడతాడు, సంతోషిస్తాడట. అందుకే ఈ అభిషేకాలు.

ఏది శైవం మరేది కాదు..

శివమూర్తిని పూజించి, అర్చించే విధానాన్నే శైవమని అంటారు. ఈ శైవం ఎనిమిది రకాలు.
ఆ 8 రకాల శైవం వివరాలు ఇవి...అనాది శైవం, ఆది శైవం, పూర్వ శైవం, విశ్ర శైవం, శుద్ధ 
శైవం, మార్గ శైవం, సామాన్య శైవం, వీర శైవం. ఈ ఎనిమిదింటిలో ప్రముఖమైంది వీర శైవం. తాము చేసే పూజా విధానంలో ఎటువంటి లోపం జరిగినా, ఎలాంటి ఆటంకం కలిగినా ప్రాణాలను గడ్డిపోచతో సమానంగా వదిలివేయడం వీర శైవంలోని ప్రధాన లక్షణంగా చెబుతుంటారు. అయితే కాలంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగానే వీరశైవ ఆరాధాకుల్లో కూడా ఇప్పుడు అంతటి పట్టింపులు ఉన్నట్టు కనబడటంలేదు. 

శివపురాణం:

అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.
శివ పురాణములో 26,000 శ్లోకాలు (మరొక లెక్కన) ఉన్నాయి. శివ పురాణాన్ని ఏడు సంహితలుగా విభజించారు

శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున (అంటే శివరాత్రి రోజునే) దీక్షను తీసుకుంటారు. ఇక భారత దేశంలో 12 చోట్ల ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిశాయి. లింగం జ్యోతిరూపంలో వెలిసిన క్షేత్రాలివి.
రామనాథ ఆలయం, రామేశ్వరం, తమిళనాడు
మల్లికార్జునేశ్వర ఆలయం, కృష్ణా నది తీరంలో, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్
భీమశంకరం, డాకిని, పూణ దగ్గర, మహారాష్ట్ర
త్ర్యంబకేశ్వరాలయం, గోదావరి నదీ తీరంలో, నాసిక్ దగ్గర, మహారాష్ట్ర
గుస్మేశ్వర ఆలయం, ఔరంగాబాద్ దగ్గర, మహారాష్ట్ర
ఓంకారేశ్వరాలయం, నర్మదా నదీతీరంలో, అమలేశ్వర్, మధ్యప్రదేశ్
సోమనాథ్ ఆలయం, సోమనాథ్, గుజరాత్
నాగనాథ ఆలయం, దారుకావన, ద్వారక దగ్గర, గుజరాత్
మహాకాళేశ్వర ఆలయము, శిప్రా నదీ తీరంలో, ఉజ్జయిని
కేదరేశ్వరాలయం, కేదారనాథ్, ఉత్తరాచల్
కాశి విశ్వనాథుని ఆలయం, వారాణసి, ఉత్తరప్రదేశ్
వైద్యనాధుని ఆలయం, జైసిద్ దగ్గర, బీహార్


శివరాత్రి జాగారం

శివరాత్రి జాగారం చేస్తే కలిగే లాభం ఏంటిట? దీనికి శివపురాణం ఏమని చెబుతుందంటే... పర్వదినం, పుణ్యదినం అయిన శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే సమస్యలు నివారింపబడతాయి. కోరికలు సఫలమౌతాయి. పెళ్ళి కానివారికి పెళ్ళి అవుతుంది. తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. సద్గతులు లభిస్తాయట. (కేవలం మెలుకువగా ఉండటంకాదండోయ్. శివధ్యానంలో తనువూ, మనసూ ఆ పరమేశ్వరునికి సమర్పించాలి. అదే నిజమైన జాగారం)


(వీటిపై మీ అభిప్రాయాలను కోరుతున్నాను)
                                                                 - నాగభూషణ రావు తుర్లపాటి - 988 529 2208

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి